
DNews: Feb11: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రం వెలుపలి నుంచి ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎంపికైన అభ్యర్థుల సమాధాన పత్రాలు సురక్షితంగా ఉన్నాయా? లేదా? ఎవరైనా వాటిని ట్యాంపరింగ్ చేశారా? ఫోరెన్సిక్ నిపుణులు వాటిని పరిశీలించాలని కోర్టు సూచించింది.
