
DNews: Feb11: దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన FMCG విభాగం రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) తమిళనాడుకు చెందిన సదరన్ హెల్త్ ఫుడ్స్ను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అయితే, ఒప్పంద విలువను వెల్లడించలేదు.
తాజా కొనుగోలు ద్వారా రిలయన్స్ కన్స్యూమర్ మిల్లెట్ ఆధారిత ఆహార విభాగంలో తన ఉనికిని విస్తరించనుంది. సదరన్ హెల్త్ ఫుడ్స్ రెండు దశాబ్దాలుగా ఆరోగ్య ఆహార విభాగంలో మన్నా బ్రాండ్ కింద వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. బెటర్ ఫర్ యు బ్రాండ్ పానీయాల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ గుడ్నెస్ గ్రూప్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ను RCPL ఇటీవల కొనుగోలు చేసిన నేపథ్యంలో తాజా కొనుగోలు ప్రాముఖ్యతను సంతరించుకుంది.
