
DSports 27Jan 2026:దుబాయ్/లాహోర్: భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి తప్పుకోవాలని చూస్తున్న పాకిస్థాన్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్కు మద్దతుగా టోర్నీని బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు అంధకారమయ్యేలా భయంకరమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది.
- ఐసీసీ నుంచి పాకిస్థాన్కు అందే వార్షిక ఆదాయ వాటా (సుమారు $34.5 మిలియన్లు – ₹288 కోట్లు) నిలిపివేయబడుతుంది.ఇతర దేశాలతో పాకిస్థాన్ ఆడే ద్వైపాక్షిక సిరీస్లపై నిషేధం లేదా సస్పెన్షన్ విధించే అవకాశం ఉంది.పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే NOCలను ఐసీసీ రద్దు చేయవచ్చు. దీనివల్ల పీఎస్ఎల్ తన గుర్తింపును కోల్పోతుంది.భవిష్యత్తులో జరిగే ఆసియా కప్ టోర్నీల నుంచి పాకిస్థాన్ను తప్పించే ప్రమాదం ఉంది.ఐసీసీ ఈవెంట్ అగ్రిమెంట్ను ఉల్లంఘించినందుకు పాక్ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కాలికంగా నిషేధించే అధికారం కూడా ఐసీసీకి ఉంది.
- భారత్లో పర్యటించేందుకు భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోగా, ఐసీసీ ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేసింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని, బంగ్లాకు అన్యాయం జరిగిందని పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ వ్యాఖ్యానించారు. పాక్ కూడా టోర్నీ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలిచ్చారు.
- ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో పాకిస్థాన్ తాజాగా సల్మాన్ అలీ అఘా సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే, జట్టును ప్రకటించినప్పటికీ టోర్నీలో ఆడాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం తమ ప్రభుత్వం (ప్రధాన మంత్రి) తీసుకుంటుందని పీసీబీ స్పష్టం చేసింది. దీనిపై ఈ శుక్రవారం లేదా వచ్చే సోమవారం లోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
“ఐసీసీ నియమాలను అతిక్రమిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది కేవలం ఒక టోర్నీకి సంబంధించింది కాదు, పాక్ క్రికెట్ అస్తిత్వానికే ముప్పు.” – ఐసీసీ వర్గాలు.
