
DSports Jan12 2026: న్యూజిలాండ్తో నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడటంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
- శనివారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పంత్ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. థ్రో-డౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యి పంత్ నడుము పైభాగంలో బలంగా తాకింది. వెంటనే పంత్ తీవ్ర నొప్పితో విలవిల్లాడాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఫిజియోలు వెంటనే అతడిని పరిశీలించి ప్రాథమిక చికిత్స అందించారు.
- బీసీసీఐ మెడికల్ టీమ్ పంత్కు వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేయించింది. వైద్య పరీక్షల్లో పంత్ కుడి వైపు పొత్తికడుపు కండరాల గాయం బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో, బోర్డు అతడిని ఈ సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
