
DSports Jan6 2026:బెనోని (దక్షిణాఫ్రికా): భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తన ప్రతాపాన్ని మరోసారి చాటాడు. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన రెండో యూత్ వన్డేలో కేవలం 15 బంతుల్లోనే అర్థ శతకం (50) పూర్తి చేసి, యూత్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పేరిట ఉన్న ఎనిమిదేళ్ల నాటి రికార్డును (18 బంతుల్లో ఫిఫ్టీ) వైభవ్ తుడిచిపెట్టేశాడు.
