
DET:SEP12: కార్తిక్ ఆర్యన్, అర్జున్ కపూర్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులతో కలిసి నటించిన కరీష్మా శర్మ, ముంబైలో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. సెప్టెంబర్ 10, 2025న, ఆమె షూటింగ్ కోసం సారీ ధరించి చర్చిగేట్ కు ప్రయాణిస్తుండగా,తన స్నేహితులు ట్రైన్ చేరుకోలేదనే విషయం గమనించి ఆమె భయంతో ట్రైన్ నుంచి దూకి పడిపోయారు, ఫలితంగా ఆమె వెన్ను, తలకి గాయమయ్యిందని, ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు, తల వాపు, వెన్ను నొప్పులు, మరియు శరీరంపై నల్లమచ్చలతో బాధపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్లు ఆమెకు MRI పరీక్షలు నిర్వహించి, తల గాయం తీవ్రమైనదిగా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరీష్మా శర్మ, “ప్యార్ కా పంచనామా 2” మరియు “రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్” వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటీమణి. ఈ ఘటన ఆమె అభిమానులను, సినీ పరిశ్రమను షాక్కు గురిచేసింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ ప్రమాదం రైల్వే ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం మళ్లీ గుర్తుచేస్తుంది. రైల్వే అధికారులు, పోలీసులు, మరియు ప్రజలు అందరూ రైల్వే ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
