
DNews:18 NOV:సిద్దిపేట జిల్లాలోని ఆకునూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఘోరం జరిగింది. స్థానికంగా శెట్టి కావ్య అనే మహిళ ఉదయం స్టౌ వెలిగించగా, అప్పటికే గ్యాస్ లీకైన విషయాన్ని ఆమె గమనించకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇళ్లంతా వ్యాపించాయి. ఈ పేలుడు ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో దంపతులు కావ్య, భాస్కర్ తో పాటు వారి ముగ్గురు పిల్లలు – ప్రణవి, కార్తీక, హర్షిణి, మరియు తాత అయ్యలం ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
