
DNews:19 Feb: మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్కు నిరసనగా కాసిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్కు స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరిస్తూ దుకాణ సముదాయాలను మూసివేశారు. నిరసనకారులు మండలంలోని విద్యాసంస్థలను కూడా స్వచ్ఛందంగా మూసివేయించారు.
ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్కు మద్దతు తెలిపిన ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇతర కీలక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
