
D Spiritual: Apr 25: కేంద్ర రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయానికి విచ్చేశారు. ఆయన ఆలయానికి చేరుకున్న సందర్భంగా రాజగోపురం వద్ద ఈవో ఎం. శ్రీనివాసరావు మరియు అర్చక స్వాములు సాదరంగా స్వాగతం పలికారు.
తరువాత మంత్రి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి అలంకార ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత ఆలయ ఈవో స్వామివారి శేషవస్త్రాలతో మంత్రిని సత్కరించి లడ్డూ ప్రసాదాలను అందించారు. చివరిగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం వారి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించారు.
