
DNews: Jan7:ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో, మద్దతు ఇవ్వడంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్తాన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల పాకిస్తాన్లోని గుజ్రన్వాలాలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, హమాస్ నాయకులు సమావేశమయ్యారు. పాకిస్తాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన సమావేశానికి హమాస్ సీనియర్ కమాండర్ నాజీ జహీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జహీర్ లష్కరే కమాండర్ రషీద్ అలీ సంధుతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెరికా నిషేధించిన రెండు ఉగ్రవాద సంస్థలు ఒకే చోట సమావేశం కావడం సంచలనం సృష్టించినప్పటికీ, ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే అని తెలుస్తోంది.
