Shock for SBI customers...charges to be paid from February 15-DTv Telangana

DNews: Feb07: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), తన కోట్లాది మంది కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ సర్వీస్ నిబంధనలలో మార్పులు ప్రకటించింది. గతంలో ఉచితంగా ఉన్న సేవలకు ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. ఆన్‌లైన్‌లో చేసిన కొన్ని లావాదేవీలపై ఉచిత సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వాటి స్థానంలో కొత్త సర్వీస్ ఛార్జీలను ఖరారు చేసినట్లు ఇప్పటికే వెల్లడించింది. సవరించిన కొత్త IMPS ఛార్జీలు ఫిబ్రవరి 15, 2026 నుండి అమల్లోకి వస్తాయని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. వివరాలను తెలుసుకుందాం.
ఆన్‌లైన్ వేదికగా జరిపే లావాదేవీలకు పంపించే నగదును బట్టి ఛార్జీలు ఉంటాయని తెలిపింది.
రూ. 25,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు (ఉచితం)
రూ. 25,001 నుంచి రూ. 1 లక్ష వరకు పంపిస్తే రూ. 2 + జీఎస్‌టీ (GST) అదనం
రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బదిలీ చేస్తే రూ. 6 + జీఎస్‌టీ
రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు పంపిస్తే రూ. 10 + జీఎస్‌టీ

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana