
DSports 28 Nov: దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత వైస్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో అభిమానులకు క్షమాపణలు చెబుతూ భావోద్వేగ పోస్ట్ చేశాడు.
భారత్, సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా భారత గడ్డపై టెస్ట్ సిరీస్ను గెలవడం ఇదే మొదటిసారి.శుభ్మన్ గిల్ గైర్హాజరీలో స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించిన పంత్, బ్యాటింగ్లో కేవలం 4 ఇన్నింగ్స్లలో 49 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా విమర్శల పాలయ్యాడు.
ఈ ఓటమి తర్వాత, జట్టు నాయకత్వంపై, ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పంత్ ఈ సందేశాన్ని పోస్ట్ చేశాడు.
