
DET:DEC 27:
వివాదానికి కారణం ఏమిటి?
సల్మాన్ ఖాన్ రాజశ్రీ పాన్ మసాలా బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.ఈ ప్రకటనలో ఆ పాన్ మసాలాలో కుంకుమపువ్వు కలిపిన యాలకులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు.అయితే కిలో లక్షల రూపాయలు పలికే కుంకుమపువ్వును అంత తక్కువ ధరకే లభించే పాన్ మసాలా ప్యాకెట్లలో ఎలా కలుపుతారని బిజెపి నాయకుడు న్యాయవాది ఇంద్రమోహన్ సింగ్ హనీ కోర్టులో ఫిర్యాదు చేశారు.ఈ ప్రకటన ప్రజలను ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన వాదించారు.
సంతకంపై అనుమానాలు మరియు ఫోరెన్సిక్ పరీక్ష:
ఈ కేసు విచారణ సందర్భంగా సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాదులు కోర్టులో సమర్పించిన పత్రాలపై ఉన్న సంతకం అసలైనది కాదని ఫిర్యాదుదారుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.గతంలో సల్మాన్ ఖాన్ జోధ్పూర్ జైలులో ఉన్నప్పుడు మరియు ఇతర కోర్టు పత్రాలపై చేసిన సంతకాలతో ఇవి సరిపోలడం లేదని ఆయన ఆరోపించారు.దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆ సంతకాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
జనవరి 20న కోర్టుకు హాజరుకావాలని ఆదేశం:
సంతకాల విషయంలో స్పష్టత రావాలంటే సల్మాన్ ఖాన్ స్వయంగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది.జనవరి 20,2026న జరిగే తదుపరి విచారణకు సల్మాన్ ఖాన్ ప్రత్యక్షంగా హాజరుకావాలని కోటా జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.తన సంతకాన్ని ధృవీకరించిన నోటరీతో కలిసి రావాలని కూడా కోర్టు సూచించింది.
నటుడి వాదన మరియు ప్రస్తుత పరిస్థితి:
సల్మాన్ ఖాన్ తరపు న్యాయబృందం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.ఆ ప్రకటనలో ఉన్నది సిల్వర్ కోటెడ్ యాలకులు మాత్రమేనని కుంకుమపువ్వు కలిపిన పాన్ మసాలా కాదని వారు వాదించారు.అలాగే కోర్టులో సమర్పించిన సంతకాలు తనవేనని సల్మాన్ ఖాన్ గతంలో పేర్కొన్నారు.అయితే కోర్టు ఇప్పుడు ఫోరెన్సిక్ నివేదికను మరియు సల్మాన్ ప్రత్యక్ష హాజరును కోరడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది.
