
DNews: Jan22: కూటమి ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రం తరపున అవసరమైన అన్ని చర్యలను పూర్తి చేసింది. ముందుగా దానిపై మంత్రివర్గంలో చర్చించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత, ఫైల్ను పార్లమెంటుకు పంపాలని నిర్ణయించారు.
2014-2019 వరకు అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంది. అయితే, 2019 ఎన్నికల తర్వాత, అమరావతి నుండి కార్యకలాపాలు జరిగినప్పటికీ, మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి. దీని ఫలితంగా ఏపీకి రాజధాని లేదని ప్రచారం జరిగింది. అయితే, రాజధాని అమరావతిని చట్టబద్ధం చేస్తే, ఈ సమస్య తలెత్తదనే ప్రతిపాదన ఊపందుకుంది. ఇందులో భాగంగా,కూటమి ప్రభుత్వం అమరావతిని చట్టబద్ధం చేయడానికి కృషి చేసింది. అంతేకాకుండా, వేగంగా చర్యలు తీసుకుంది. తన పదవీకాలంలో అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై మంత్రివర్గంలో చర్చించి, ఆపై పార్లమెంట్ ద్వారా రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలని యోచిస్తోంది.
