
DSports 13 Nov :దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అక్టోబర్ 2025 నెలకు కైవసం చేసుకుంది. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆమె అద్భుతమైన ప్రదర్శన కనబరచడం, జట్టును ఫైనల్ వరకు నడిపించడంలో కీలక పాత్ర పోషించడం ఈ అవార్డుకు కారణమైంది. ఈ మెగా టోర్నమెంట్లో ఆమె అత్యధిక పరుగులు (571 పరుగులు) సాధించిన క్రీడాకారిణిగా నిలిచి, ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా నెలకొల్పింది. ముఖ్యంగా, సెమీ-ఫైనల్లో 169 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు, ఫైనల్లోనూ సెంచరీ (101 పరుగులు) సాధించి అలిస్సా హీలీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఈ ప్రతిభావంతమైన ప్రదర్శన కారణంగానే ఆమె ఐసీసీ ర్యాంకింగ్స్లో నంబర్ 1 వన్డే బ్యాటర్గా కూడా ఎదిగింది. ఈ అవార్డును అందుకోవడం తన జట్టు ప్రపంచకప్లో ప్రదర్శించిన గొప్ప పోరాటానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు లారా వోల్వార్ట్ పేర్కొంది.
