
DNews: Dec6: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కేరళ తరహా విద్యా విధానం మనకు కూడా అవసరమని, అక్కడ విద్యార్థి-తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉన్నాయని అన్నారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారద జెడ్పి స్కూల్లో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో సంభాషించారు. విద్యార్థుల సాంస్కృతిక, క్రీడా ప్రదర్శనలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వినోదం కోసం సినిమాలు చూసి చెడిపోవద్దని విద్యార్థులు, యువతకు సూచించారు. 1600 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కంప్యూటర్లు, లైబ్రరీలో పుస్తకాలు, ఆట స్థలం, ఇతర సౌకర్యాలు లేకపోవడం దారుణమని అన్నారు. పాఠశాల దగ్గర రెండు ఎకరాల భూమిని చూపిస్తే, దానిని మైదానం కోసం అందించే బాధ్యత తనదేనని, లైబ్రరీకి 25 కంప్యూటర్లు, పుస్తకాలు అందిస్తానని ప్రకటించారు. వివిధ రూపాల్లో గంజాయి అందుబాటులో ఉందని, విద్యార్థులు ఎక్కడైనా గంజాయితో పట్టుబడితే తాను క్షమించనని హెచ్చరించారు. ఖాళీ సమయంలో పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వవద్దని, శాస్త్రవేత్తల గురించి మాట్లాడాలని తల్లిదండ్రులకు సూచించారు. పది మంది కుటుంబ సభ్యులు కలిసి వచ్చి తమ పిల్లలకు ఒక చిన్న లైబ్రరీని ఏర్పాటు చేసి, అక్కడ చదువుకోనివ్వాలి. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
