
DSports o4 Nov :ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025 విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన కడప జిల్లా బిడ్డ, నల్లపురెడ్డి శ్రీ చరణి తన అనుభవాన్ని పంచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచకప్లో తమ విజయం వెనుక ఉన్న మానసిక స్థైర్యాన్ని ఆమె వెల్లడించారు.
శ్రీచరణి వ్యాఖ్యల సారాంశం
ఒత్తిడికి లోను కాలేదు: లీగ్ దశలో తాము ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్ల చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆ ఫలితాలను మనసులో పెట్టుకొని సెమీస్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్లలో ఒత్తిడికి లోను కాలేదు అని శ్రీచరణి తెలిపారు.
ఆత్మవిశ్వాసం: “సెమీఫైనల్కు ముందు.. ఎన్నో వరల్డ్కప్లు గెలిచిన ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుందా? అనే చర్చలను జట్టుగా మేము అసలు పట్టించుకోలేదు. ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కు మనం వెళ్తున్నాం అనే ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాం” అని స్పష్టం చేశారు.
ఫైనల్ భయం లేదు: ఫైనల్లో సొంత ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలతో ఆడుతున్నామనే ఒత్తిడి, భయానికి లోను కాకుండా తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని ఆమె పేర్కొన్నారు.
పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఖో-ఖో క్రీడ నుండి క్రికెట్లోకి వచ్చి, ఈ స్థాయిలో రాణించడం శ్రీచరణి అసాధారణ ప్రయాణానికి నిదర్శనం.
భారత జట్టు విజయంలో ఈ తెలుగమ్మాయి పోషించిన పాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి.
