
DSports 24 Nov: దోహాకొలంబో: భారత క్రీడా చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. మొట్టమొదటి అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ (Inaugural Blind Women’s T20 World Cup 2025) ను భారత జట్టు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీపికా టీసీ నేతృత్వంలోని మన అమ్మాయిలు ఫైనల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి, టైటిల్ పట్టుకుపోయారు.
నేపాల్ మహిళల జట్టు.టాస్ గెలిచిన భారత కెప్టెన్ దీపికా టీసీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరిచి, నేపాల్ను నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులకే కట్టడి చేశారు. నేపాల్ ఇన్నింగ్స్లో ఒక్క బౌండరీ మాత్రమే నమోదు కావడం భారత బౌలింగ్ పదునుకు నిదర్శనం.115 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దూకుడు ప్రదర్శించారు. కేవలం 12.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని సాధించారు.భారత బ్యాటర్ ఫూలా సరన్ (Phula Saren) అద్భుతంగా ఆడింది. ఆమె కేవలం 27 బంతుల్లో 4 బౌండరీలతో 44 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించింది. ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
