
DNews: Jan31: కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ ఇ-సైకిళ్లతో ర్యాలీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. 5,555 ఈ–సైకిళ్లను లబ్ధిదారులకు సీఎం పంపిణీ చేశారు. 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఇ-సైకిళ్లను లబ్ధిదారులకు అందించడం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.
రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఇంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో మీ సైకిల్ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సూపర్ సైకిల్… పైసా ఖర్చు లేకుండా పరుగెత్తగలదు. మీరు సైకిల్కు ఓటు వేశారు… అభివృద్ధి అంటే ఏమిటో మేము చూపించాము” అని సీఎం చంద్రబాబు అన్నారు.
