
DNews: 1 Nov: ఒక మహిళా న్యాయవాదికి ఫోన్ చేసి. అమెరికాలో ఉన్న ఆమె కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తామని అంతర్రాష్ట్ర సైబర్ ముఠా బెదిరించారు. ఆమె నుంచి రూ.52 లక్షలు తీసుకున్నారు. ఈ సంఘటనపై బాధితురాలు ఏలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు బృందాలను రంగంలోకి దించారు. ఈ ముఠాలోని 8 మంది సభ్యులను యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రలలో అరెస్టు చేశారు. కీలక సూత్రధారులు బంగ్లాదేశ్కు పారిపోయారు. ఈ సైబర్ ముఠా దేశంలో రూ.100 కోట్లకు పైగా మోసం చేసిందని ప్రాథమిక సమాచారం.
