
DNews: Nov 22: జన్నారం మండలంలోని టీజీపీల్లి గ్రామానికి చెందిన ముత్యం సతీష్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోయి రూ.1,34,500 నష్టపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. సతీష్కు కస్టమర్ సర్వీస్ యాప్ నుండి ఒక లింక్ మొబైల్కి వచ్చింది. ఆ లింక్ను ఆయన ఓపెన్ చేయకపోయినా, అకౌంట్ నుండి రూ.1.24 లక్షలు మాయమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆయన బ్యాంకుకు వెళ్లి అధికారులతో మాట్లాడుతుండగా, మరో రూ.10,500 కూడా అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ అయినట్లు తెలిసింది. మొత్తం రూ.1,34,500 నష్టం జరిగినట్లు సతీష్ తెలిపారు. ఈ ఘటనపై ఆయన జన్నారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సతీష్ జన్నారం లోని ఏఆర్ఎస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు.
