
DNews: Dec 05: వరంగల్ జిల్లా నర్సంపేటలో బీజేపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని అవమానించాయని ఆరోపిస్తూ, ఆయన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే నర్సంపేటలో అడుగుపెట్టకూడదని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో భాగంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీఎం సమావేశానికి వెళ్తుండగా వారి వాహనాలను అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకొని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నిరసనల కారణంగా నర్సంపేటలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
