
DNews: Feb05:సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ హయాంలో రామతీర్థంలో శ్రీరాముడి తల తొలగింపు గురించి అడిగినప్పుడు మాపై కేసు నమోదైందని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, లడ్డూ కల్తీ అనేది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న సమస్య అని అన్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారని ఆరోపించారు. నెయ్యి కల్తీపై వైసీపీకి సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన అన్నారు. తిరుమల నెయ్యి కల్తీపై అన్ని నివేదికలను బహిరంగపరుస్తామని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యలు ిన తీసుకుంటామని ఆయన అన్నారు. దోషులను వదిలిపెట్టం వారిని శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సీబీఐ సిట్ ఛార్జ్ షీట్ అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
