
DET:SEP29:
ఐశ్వర్య రాయ్: పారిస్ ఫ్యాషన్ వీక్కి రాక, అభిమాని కన్నీళ్లు తుడిచిన తీరు:
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తాజాగా పారిస్ ఫ్యాషన్ వీక్ కోసం తన కూతురు ఆరాధ్య బచ్చన్తో కలిసి పారిస్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి హోటల్కి వెళ్తున్న సమయంలో ఐశ్వర్యను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో జరిగిన ఓ హృదయపూర్వక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అభిమాని కన్నీళ్లు తుడిచి ఓదార్చిన ఐశ్వర్య:
ఐశ్వర్యను చూసి ఉప్పొంగిపోయిన ఓ యువ అభిమాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అది గమనించిన ఐశ్వర్య రాయ్ వెంటనే ఆగి, ఆ అభిమాని దగ్గరకు వెళ్లింది. ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుని, ధైర్యం చెప్పింది. అంతేకాకుండా, తన చేతులతో ఆ అభిమాని కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లను తుడిచి, ఊపిరి తీసుకోమని చెప్పి, తర్వాత ఫోటోకు ఫోజులిచ్చింది. స్టార్డమ్ ఉన్నా కూడా ఇంతటి దయతో వ్యవహరించిన ఐశ్వర్య మంచి మనసును చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కెమెరాలకు దూరంగా ఆరాధ్య:
ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్ కెమెరాలకు కనిపించకుండా జాగ్రత్త పడింది. అభిమానులు మరియు మీడియా చుట్టుముట్టేసరికి, ఆరాధ్య తొందరగా కారు ఎక్కి లోపలికి వెళ్లిపోయింది. కెమెరాలకు చిక్కకుండా ఉండటానికి ఆమె ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. తన తల్లిపై ఉన్నంత దృష్టి తనపై పడకుండా ఆరాధ్య జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
