
DET:OCT 13:
తారల మెరుపుల దారి:
ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకకు బాలీవుడ్ తారలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏటా జరిగే ఈ వేడుకకు సినీ ప్రముఖులు తమ ఫెస్టివల్ దుస్తుల్లో వచ్చి పార్టీకి మరింత శోభను తీసుకొచ్చారు. కరీనా కపూర్ ఖాన్, హేమ మాలిని, కరణ్ జోహార్, ఊర్మిళా మటోండ్కర్ వంటి ఎందరో స్టార్స్ వారి వారి అలంకరణలతో అబ్బురపరిచారు. దీప కాంతుల మధ్య జరిగిన ఈ పార్టీలో అందరూ ఉల్లాసంగా, సంప్రదాయబద్ధంగా కనిపించారు.
కరీనా రాజసపు అలంకరణ:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె తన రాజసపు తెల్లటి అనార్కలీ దుస్తుల్లో, మెరిసే ఆభరణాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన సింపుల్, క్లాసీ లుక్తో కరీనా మరోసారి ఫ్యాషన్ క్వీన్గా నిరూపించుకుంది. ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
సీనియర్ నటుల సందడి :
డ్రీమ్ గర్ల్ హేమ మాలిని వంటి సీనియర్ నటులు కూడా ఈ పార్టీకి వచ్చి సందడి చేశారు. హేమ మాలిని సంప్రదాయ చీరకట్టులో ఎంతో హుందాగా కనిపించారు. అలాగే, అందాల నటి ఊర్మిళా మటోండ్కర్ కూడా నీలి రంగు జాకెట్-షరారా సెట్లో తళతళా మెరిసారు. ఈ దిగ్గజ తారల రాకతో వేడుకకు సంప్రదాయ వైభవం వచ్చింది.
కరణ్ జోహార్, ఇతర సన్నిహితులు:
మనిష్ మల్హోత్రాకి అత్యంత సన్నిహితుడైన దర్శకుడు కరణ్ జోహార్ ఎప్పటిలాగే తన ఫ్యాషన్ స్టైల్తో ఆకట్టుకున్నారు. ఆయన ఎరుపు రంగు షేర్వాణీలో హుషారుగా కనిపించారు. ఇంకా, రకరకాల కలర్స్, డిజైన్లలో లెహంగాలు, చీరలు, స్టైలిష్ ఎథ్నిక్ వేర్లలో ఇతర నటీనటులు, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ దీపావళి పార్టీ, బాలీవుడ్ గ్లామర్, సంప్రదాయం మేళవింపుగా నిలిచింది.
