
D News: భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాకు నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు.
అదే సమయంలో జపాన్కు చెందిన ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ కూడా అంతర్జాతీయ మార్కెట్లోకి రాబోతోంది. తకాషి యమజాకి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘గాడ్జిల్లా మైనస్ వన్’కు కొనసాగింపుగా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
రెండు సినిమాలు ఒకే సమయంలో రావడంతో బాక్సాఫీస్ పోటీపై ఇప్పటికే చర్చ మొదలైంది. అయితే అసలు పోటీ ఐమ్యాక్స్ స్క్రీన్ల విషయంలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సినిమాలూ భారీ విజువల్స్తో తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రీమియం స్క్రీన్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ను Filmed for IMAX చిత్రంగా ప్రమోట్ చేస్తున్నారు. ‘రామాయణ’కు కూడా ఓవర్సీస్ మార్కెట్లలో ఐమ్యాక్స్ స్క్రీన్లపై భారీ అంచనాలున్నాయి. దీంతో నార్త్ అమెరికా వంటి మార్కెట్లలో ఏ సినిమాకు ఎక్కువ ప్రీమియం స్క్రీన్లు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ‘గాడ్జిల్లా మైనస్ వన్’కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆదరణ సీక్వెల్కు ప్లస్ కానుంది. మరోవైపు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘రామాయణ’కు భారతీయులతో పాటు విదేశాల్లోని ఇండియన్ ఆడియెన్స్లోనూ భారీ క్రేజ్ ఉంది.
మొత్తానికి నవంబర్ 6న ఈ రెండు సినిమాల మధ్య పోరు కేవలం వసూళ్లకే పరిమితం కాకుండా ఐమ్యాక్స్ స్క్రీన్ల వరకు వెళ్లేలా కనిపిస్తోంది. విడుదలకు దగ్గరయ్యే కొద్దీ ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
