D Educt: Aug 25: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యాన కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కీలక చర్యలు చేపట్టింది. నేల సారవంతత, విత్తనాల నిర్వహణ, చీడపీడల నియంత్రణ, డిజిటల్‌ సాగు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ వ్యవసాయ, జీవశాస్త్రాల కేంద్రం (క్యాబి)తో కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఉద్యాన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో ఆగస్టు 24న ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమం జరిగింది. వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ దండా రాజిరెడ్డి సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్‌, క్యాబి సంస్థ భారత విభాగాధిపతి మాళవిక ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై మెరుగైన అవగాహన పొందడంతో పాటు, ఉద్యాన పంటల సాగులో ఎదురయ్యే సమస్యలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కరించుకునే నైపుణ్యాలను పెంపొందించుకోనున్నారు. డిజిటల్‌ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో సమర్థంగా వినియోగించడం, మార్కెటింగ్‌ విధానాలపై అవగాహన పెంచుకోవడం వంటి అంశాల్లోనూ ఈ కార్యక్రమం విద్యార్థులకు ఉపయోగపడనుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana