D Spiritual: Aug 17: శైవ క్షేత్రమైన శ్రీశైలానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున శ్రీశైలానికి చేరుకున్నారు. దీంతో నంద్యాల జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.

ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్లలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు సిబ్బంది రంగంలోకి దిగి, నిలిచిపోయిన వాహనాలను ముందుకు కదిలించేందుకు చర్యలు చేపట్టారు.

భక్తుల రద్దీ కారణంగా మల్లన్న స్వామి దర్శనానికి కూడా ఎక్కువ సమయం పడుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు భద్రతా చర్యలను పటిష్టం చేశారు. భక్తులకు వరుస క్రమంలో దర్శనం కల్పిస్తున్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని ఆలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana