
DNews: Apr 30: హైదరాబాద్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తాజాగా టీఆర్ఎస్ పార్టీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు కేటాయించింది. ఈ నెల 25న మెడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో కవిత టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తెలంగాణ రాక్షస సేన’ అనే పేరును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు గురువారం బంజారాహిల్స్లోని కవిత నివాసానికి వెళ్లి పార్టీకి అనుమతి మంజూరు చేసిన లేఖను అందజేశారు. దీంతో కవిత ప్రకటించిన కొత్త పార్టీకి అధికారిక గుర్తింపు లభించింది.
