
DNews: Apr30: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల (ఏపీ 10వ తరగతి ఫలితాలు 2026) విడుదలకు సర్వం సిద్ధమైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ను results.bse.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసి నేరుగా ఫలితాలను పొందవచ్చు.
