
D Spiritual: Apr 21: ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా ఆదివారం ఉదయం తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంను దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకున్న ఆమె, సామాన్య భక్తులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించారు. ఆలయం వెలుపల అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీ పడగా, తమన్నా తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, తమన్నా తదుపరి చిత్రం వ్వాన్ (Vvan)లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో కనిపించనుండగా, దర్శకులుగా దీపక్ మిశ్రా మరియు అరుణాభ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం రక్షా బంధన్ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది.
