
DNews: Apr10: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద హెచ్చరిక. అనేక జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎండలు కాస్తున్నాయి. ప్రతిరోజూ అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే, కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావం వల్ల విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోణసీమ, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
