
DNews: Mar 18: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంత ప్రజలు పరస్పర దాడుల కారణంగా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతొల్లా మోజ్తబా ఖమెనేయిని ఎక్కడ ఉన్నా వెంబడించి నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ బలమైన హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ మాట్లాడుతూ, “ఖమెనేయి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో మాకు సమాచారం లేదు. కానీ మా దేశానికి ప్రమాదకరంగా ఉన్న వారిని నిర్మూలించడాన్ని ఆపలేం. మా మీద పనిచేసే వారు తప్పించుకోలేరు. వారిని ఎక్కడ ఉన్నా వెంబడించి నిర్మూలిస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది చెప్పలేము కానీ లక్ష్యం తప్పదు” అని స్పష్టం చేశారు. మరోవైపు, ఖమెనేయి గాయపడిన కారణంగా రష్యాకు చికిత్స కోసం తరలించారన్న వార్తలను తేహ్రాన్ ఖండించింది. రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలి ‘X’ ప్లాట్ఫారమ్లో స్పష్టం చేస్తూ, “ఇరాన్ నాయకులు పారిపోవాల్సిన అవసరం లేదు, ఆశ్రయాల్లో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు” అని తెలిపారు. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
