
DNews: Mar13: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీ లడ్డూ కేసుపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా, జంతువుల కొవ్వు కలిపారని చెప్పడానికి మీరు నిపుణులా కాదా అని ప్రశ్నించింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఎవరు మాట్లాడకుండా స్టే విధించాలి. ఇలాంటి బహిరంగ ప్రకటనలను సీబీఐ ఆపలేకపోతున్నదని మనూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చెప్పడానికి మీరు నిపుణులా కాదా అని సీజేఐ పిటిషనర్ న్యాయవాదిని అడిగారు. ఏదైనా ఆధారాలు ఉంటే సీబీఐ అధికారులకు అందించాలని సూచించింది. దర్యాప్తు విలువైనది కాదని పిటిషన్ను తోసిపుచ్చారు.
