
DNews: Feb27: గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిపుణులైన న్యూరో సర్జన్లు, ఐసీయూలోని వైద్య బృందం ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. మెదడులో రక్త ప్రసరణ, ఇతర పారామితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందని, ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. బొత్స ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ అనారోగ్య వార్త తెలియగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
