
DNews: Feb03:ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్న మద్యం దుకాణాలపై ఫిర్యాదులు వచ్చాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని ఆయన అన్నారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను పవన్ ఆదేశించారు.
