
DNews: Feb02: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల తర్వాత పోలీసులు ఆయనను గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్ విధించారు. రాష్ట్రవ్యాప్తంగా అంబటి రాంబాబుపై 16 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, పదే పదే తీవ్ర విమర్శలు చేస్తూ వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని నల్లపాడు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. త్వరలోనే అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.
