
DNews: Jan28:మంగళవారం దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ.. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 81,857 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో 25,175 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం రేటు 91.73.
ఉదయం మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 449 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 116 పాయింట్లు పడిపోయింది. అయితే, భారత్-యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం సానుకూలతలకు దోహదపడింది. మరోవైపు, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. రూపాయి కోలుకోవడం, ముడి చమురు ధరల పతనం దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్కు $65.12 వద్ద ఉంది. అలాగే, అమెరికా సుంకాలను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. దానితో, మన సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 30 సూచికలో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా మరియు NTPC స్టాక్లు లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, ఎటర్నల్, మారుతి సుజుకి స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
