
DSports 23Jan 2026:రాయ్పూర్: నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ను చిత్తు చేసిన టీమిండియా, ఇప్పుడు రెండో విజయంపై కన్నేసింది. నేడు (జనవరి 23) రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
- తొలి టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి (5 ఫోర్లు, 8 సిక్సర్లు) కివీస్ బౌలర్లను విరక్తి చెందించాడు. రింకూ సింగ్ (44 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) కూడా రాణించడంతో భారత్ 238 పరుగుల భారీ స్కోరు సాధించింది.
- భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. వరుణ్ చక్రవర్తి, శివం దూబే రెండేసి వికెట్లతో రాణించడంతో కివీస్ 190 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 48 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
