
DNews: Jan8:భారత విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. వీసా అనేది హక్కు కాదని.. మరియు వారు తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు, దేశం నుండి బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది.
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తన X ఖాతాలో ట్వీట్ చేసింది. అందులో, అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో..
“అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వీసా అనేది హక్కు కాదు. ఇది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే.” ఈ క్రమంలో.. వారిని దేశం నుండి బహిష్కరించడమే కాకుండా, భవిష్యత్తులో వారి వీసా అర్హతను కూడా కోల్పోవచ్చని స్పష్టం చేసింది.
