
DSports Dec23 2025:న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలోని చిన్నారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025’ విజేతల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పారా అథ్లెట్ శివాని చోటు దక్కించుకున్నారు. ఆదిత్య మెహతా ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్న శివాని, శారీరక వైకల్యాన్ని అధిగమించి క్రీడల్లో అద్భుతాలు సృష్టిస్తూ ఈ గౌరవానికి అర్హులయ్యారు.
శివాని వంటి చిన్నారులు తమ పట్టుదల, కృషి ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, అందుకే వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శివానితో పాటు హర్యానాకు చెందిన మరో పారా అథ్లెట్ జ్యోతి కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
