
DSports Dec23 2025:ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల వన్డే ప్రపంచకప్లో చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో, దేశవాళీ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా వేతనాలు అందించాలనే లక్ష్యంతో దేశవాళీ మ్యాచ్ ఫీజులను 150 శాతం వరకు పెంచింది.
- సీనియర్ టీ20 మ్యాచ్లకు ప్లేయింగ్ ఎలెవన్లో ఉన్న వారికి ₹25,000, రిజర్వ్ ప్లేయర్లకు ₹12,500 లభిస్తాయి.ఈ కొత్త నిర్ణయంతో అన్ని ఫార్మాట్లు ఆడే ఒక అగ్రశ్రేణి దేశవాళీ మహిళా క్రికెటర్ ఏడాదికి ₹12 లక్షల నుండి ₹14 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది.కేవలం ఆటగాళ్లకే కాకుండా, మ్యాచ్ అధికారులు, అంపైర్ల ఫీజులను కూడా బీసీసీఐ పెంచింది. లీగ్ మ్యాచ్లకు అంపైర్లకు రోజుకు ₹40,000, నాకౌట్ మ్యాచ్లకు ₹50,000 నుండి ₹60,000 వరకు అందనుంది.
- అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే పురుషులతో సమానంగా వేతనాలు అందుతుండగా, ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో కూడా దాదాపు సమానమైన వేతనాలు అందించడం వల్ల మహిళా క్రికెట్ మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
