
DSports 10 Dec:ముంబై/న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త ఉత్సాహం నింపేలా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకతో స్వదేశంలో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అండర్-19 ప్రపంచకప్ విజేతలైన ఇద్దరు యువ స్టార్లు జి. కమలిని మరియు వైష్ణవి శర్మలకు తొలిసారిగా సీనియర్ జట్టులోకి చోటు దక్కింది.
అండర్-19 నుంచి సీనియర్స్లోకి జంప్
ఈ యువ క్రీడాకారిణులు ఇటీవల ముగిసిన ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. వారి నిలకడైన ప్రదర్శన, భవిష్యత్తుపై ఉన్న నమ్మకంతో సెలెక్టర్లు వారికి జాతీయ జట్టులోకి పిలుపునిచ్చారు.
జి. కమలిని (వికెట్ కీపర్ – బ్యాటర్): కమలినిని రిచా ఘోష్కు బ్యాకప్ వికెట్ కీపర్గా ఎంపిక చేశారు. అండర్-19 ప్రపంచకప్లో ఆమె బ్యాటింగ్లో మూడో అత్యధిక రన్స్ (143 పరుగులు) సాధించి తన విలువను నిరూపించుకుంది.
వైష్ణవి శర్మ (ఎడమచేతి వాటం స్పిన్నర్): వైష్ణవి శర్మ అండర్-19 ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు (17) తీసిన బౌలర్గా నిలిచింది. ఆమె తన కెరీర్లో వేగంగా ఎదుగుతూ తొలిసారిగా సీనియర్ జట్టులో స్థానం సంపాదించింది.
గాయం నుంచి కోలుకున్న స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ కూడా జట్టులోకి తిరిగి వచ్చింది. తెలుగమ్మాయిలు శ్రీ చరణి (ఏపీ) మరియు అరుంధతి రెడ్డి (తెలంగాణ) కూడా జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ సిరీస్ 2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్కు ముందు భారత జట్టుకు కీలకమైన సన్నాహకంగా నిలవనుంది.
