
DSports 1 Dec: కోల్కతా: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విధ్వంసకర ఆల్రౌండర్లలో ఒకడైన వెస్టిండీస్ స్టార్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అభిమానులను షాక్కు గురిచేస్తూ, ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆదివారం (నవంబర్ 30, 2025) సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
అయితే, క్రికెటర్గా ఐపీఎల్కు గుడ్బై చెప్పినా, తన అభిమాన ఫ్రాంచైజీ కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో తన అనుబంధాన్ని కొనసాగించనున్నట్లు రస్సెల్ స్పష్టం చేశాడు.
రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటనపై KKR సహ యజమాని షారూఖ్ ఖాన్ కూడా భావోద్వేగంతో స్పందించారు. “అద్భుతమైన జ్ఞాపకాలకు ధన్యవాదాలు ఆండ్రీ. నువ్వు మా జట్టుకు కవచం లాంటివాడివి. పవర్ కోచ్గా మా కుర్రాళ్లకు నీ అనుభవాన్ని, శక్తిని పంచుతావని విశ్వసిస్తున్నాను. నీకు పర్పుల్ అండ్ గోల్డ్ జెర్సీ తప్ప మరేదీ సరిపోదు!” అంటూ ట్వీట్ చేశారు
