
DSports 25 Nov:టోక్యో: భారత యువ షూటింగ్ స్టార్ ప్రాంజలి ప్రశాంత్ ధుమాల్ డెఫ్లింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో తన సంచలన ప్రదర్శనను కొనసాగిస్తూ దేశానికి మరో పసిడి పతకాన్ని అందించింది. టోక్యోలో జరుగుతున్న క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ప్రాంజలి ఆద్యంతం ఆధిపత్యం చెలాయించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ప్రాంజలికి ఈ టోర్నీలో ఇది మూడవ పతకం కావడం విశేషం. కేవలం ఒకే డెఫ్లింపిక్స్ ఈవెంట్లో మూడు పతకాలు సాధించి ఆమె చరిత్ర సృష్టించింది.
