
DNews: Nov 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార మంత్రి కె.పార్థసారథి గారు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం తెలంగాణలోని ప్రసిద్ధ యాత్రా స్థలమైన యాదగిరిగుట్టను దర్శించారు. ఆలయ అధికారులు, పురోహితులు సంప్రదాయబద్ధంగా మంత్రి కుటుంబాన్ని ఆహ్వానించి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి గారు ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించబడిన స్వయంభూ పంచనరసింహ విగ్రహాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ఆయన తన మనవరాలికి అన్నప్రాశన కార్యక్రమాన్ని నిర్వహించి దేవునికి నమస్కారాలు సమర్పించారు. ఆలయ పురోహితులు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాన్ని మంత్రి గారికి మరియు ఆయన కుటుంబ సభ్యులకు సమర్పించారు. ఈ విధంగా మంత్రి కుటుంబం యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
