
DSports 19 Nov :భారత యువ బాక్సర్ ప్రీతి పవార్ అంతర్జాతీయ వేదికపై పెను సంచలనం సృష్టించింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ 2025 సెమీఫైనల్లో, ఆమె ఒలింపిక్ పతక విజేత మరియు మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్గా ఉన్న చైనీస్ తైపీకి చెందిన దిగ్గజ బాక్సర్ హువాంగ్ హ్సియావో-వెన్ను చిత్తు చేసింది. 54 కిలోల విభాగంలో జరిగిన ఈ పోరులో ప్రీతి తన అనుభజ్ఞురాలైన ప్రత్యర్థికి ఎటువంటి లయను కనుగొనడానికి అవకాశం ఇవ్వకుండా, ఆమె దాడులను అడ్డుకుంటూ అద్భుతమైన నియంత్రణ ప్రదర్శించింది. ఆమె ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రదర్శనతో 4-0 తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్ బౌట్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంపై ప్రీతి మాట్లాడుతూ, “ఆమె ప్రపంచ ఛాంపియన్ అని నాకు తెలుసు. కానీ ప్రపంచ ఛాంపియన్గా మారాలంటే, ప్రపంచ ఛాంపియన్ను ఓడించాలి. అదే లక్ష్యంతో నేను బరిలోకి దిగాను” అని తెలిపింది. ఈ టోర్నీలో ప్రీతి విజయం సాధించగా, మరో ఏడుగురు భారత బాక్సర్లు కూడా తమ విభాగాలలో ఫైనల్స్కు చేరుకున్నారు.
