
DSports 11 Nov :భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇటీవల వచ్చిన విమర్శలకు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆమెకు గట్టిగా మద్దతు పలికారు. తాజాగా భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత కూడా, కొంతమంది మాజీ క్రికెటర్లు హర్మన్ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని, బ్యాటింగ్, ఫీల్డింగ్పై దృష్టి పెట్టాలని సూచించడంతో ఈ వివాదం మొదలైంది.
వరల్డ్ కప్ విజయం తర్వాత జట్టు సంబరాల్లో ఉన్న ఈ సమయంలో, మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి వంటి వారు హర్మన్ప్రీత్ నాయకత్వంపై వేసిన ప్రశ్నలకు అంజుమ్ చోప్రా ఈ విధంగా బలంగా సమాధానం ఇచ్చారు.
