
DET:NOV 10:
నటదిగ్గజం సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి నిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించడానికి మొదట్లో దుల్కర్ సల్మాన్ చాలా భయపడ్డారని,దర్శకుడు నాగ్ అశ్విన్ నచ్చచెప్పాకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని ఇటీవల జరిగిన ఒక సక్సెస్ మీట్లో నాగ్ అశ్విన్ గుర్తు చేసుకున్నారు.
మహానటి చేయనని చెప్పిన దుల్కర్:
మలయాళంలో ఇప్పటికే స్టార్గా ఉన్న దుల్కర్ని మహానటి జెమినీ గణేశన్ పాత్ర కోసం అడగడానికి నాగ్ అశ్విన్ చెన్నై వెళ్ళారు.అప్పుడు దుల్కర్,నాకు తెలుగు రాదు ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా?నేను సరిగ్గా మాట్లాడలేనని అనుకుంటారేమో? అని తన భయాన్ని,సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఈ సినిమా చేయనని చెప్పడానికి సిద్ధపడ్డారట.ఈ పాత్ర చేయడంలో ఆయనకు భాషాపరమైన భయం ఎక్కువగా ఉండేది.
నాగ్ అశ్విన్ నమ్మకమే మార్పు:
అయితే,దర్శకుడు నాగ్ అశ్విన్ పదే పదే నచ్చజెప్పడంతో,ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో దుల్కర్ చివరకు ఒప్పేసుకున్నారు.తనపై పెట్టుకున్న ఆ నమ్మకమే ఆయన కెరీర్ని మలుపు తిప్పింది.మహానటి జెమినీ గణేశన్గా దుల్కర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక,ఆయనకు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్:
నాగ్ అశ్విన్ ఇటీవల లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ,దుల్కర్ ఆ రోజు తెలుగులో నటించలేనని అన్నాడు.కానీ, ఆరేళ్ళు,మూడు బ్లాక్బస్టర్ హిట్ల తర్వాత,ఇప్పుడు చాలా మంది కంటే కూడా ఆయనొక తెలుగు సూపర్ స్టార్ అయ్యాడు,అని సంతోషం వ్యక్తం చేశారు.దుల్కర్ సల్మాన్ ఈ ప్రయాణాన్ని చూసి నాగ్ అశ్విన్ గర్వంగా ఉందని చెప్పారు.మహానటి ర్వాత సీతారామంతో కూడా దుల్కర్కు తెలుగులో అద్భుతమైన విజయం లభించింది.
