
DET:NOV 08:
అవిహితం OTT విడుదల తేదీ ఖరారు!
మలయాళంలో మంచి స్పందన అందుకున్న సినిమా అవిహితం.సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ బ్లాక్ కామెడీ డ్రామా సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమైంది.ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ వార్తతో,థియేటర్లలో ఈ సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 14 నుండి స్ట్రీమింగ్:
అవిహితం సినిమా నవంబర్ 14 నుండి డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమవుతోంది.ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన జియో సినిమాతో పాటు OTTplay ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది.ఈ మేరకు ఓటీటీ సంస్థలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి.
తెలుగు ప్రేక్షకులకు శుభవార్త:
ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది.మలయాళంతో పాటు తెలుగు,తమిళం,కన్నడ,హిందీ భాషల్లో కూడా అవిహితం స్ట్రీమింగ్ కానుంది.దీంతో తెలుగు ప్రేక్షకులు ఇంట్లోనే ఉండి,ఈ విభిన్నమైన మలయాళీ కామెడీ థ్రిల్లర్ను ఆస్వాదించే అవకాశం లభించింది.
సినిమా కథా నేపథ్యం:
అవిహితం అనేది ఒక చిన్న గ్రామంలోని సామాజిక కపటాన్ని,నైతిక పోలీసుతనాన్ని ప్రశ్నించే కథాంశంతో తెరకెక్కింది.ఒక అక్రమ సంబంధం గురించి పుకారు పుట్టడం,ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆ వ్యవహారాన్ని ఎలా విచారించడానికి పూనుకున్నారు,ఈ మొత్తం ప్రక్రియలో ఒక మహిళ గుర్తింపును సమాజం ఎలా అపహాస్యం చేసింది అనే అంశాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
నటీనటులు,సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో ఉన్ని రాజ్,రెంజి కంకోల్,వినీత్ చాక్యార్, ధనేష్ కొలియత్,రాకేష్ ఉషార్,బృందా మీనన్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు.సెన్నా హెగ్డే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీరాజ్ రవీంద్రన్,రమేష్ మాథ్యూస్ సినిమాటోగ్రఫీ అందించగా,శ్రీరాగ్ సాజి సంగీతాన్ని సమకూర్చారు.
